రసాయన ఆయుర్వేదం వలన ఎటువంటి దుష్ప్రయోజనాలు జరగకపోగా ఇతర ట్రీట్మెంట్ల వలన కలిగే దుష్ప్రభావాలను కూడా నయం చేస్తుంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు మొదట శరీరంలోని మెటబాలిజాన్ని దెబ్బతీసి కణాల వ్యవహారశైలిని ప్రభావితం చేస్తుంటాయి. ఇతర వైద్యాలలో ఉన్న నాలుకకు మందు వేస్తే కొండనాలుక ఎఫెక్ట్ అయిన చందాన పనిచేయడం వలననే ఇటువంటి అనుమానాలు వస్తుంటాయి. కానీ రసాయన ఆయుర్వేదం వ్యాధి మూలాలపైన సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీంతో కొత్త క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవకుండా ఉంటాయి. ఇతర అవయవాలకు వ్యాప్తి చెందిన క్యాన్సర్ కణాలను ఒక్కొక్కటిగా ఏరిపారేస్తుంది రసాయన ఆయుర్వేదం.
ఈ ట్రీట్మెంట్లో ప్రధానంగా శరీర ఇమ్యునిటీ స్థాయిని పెంచే విధంగా మొదట రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరంలో ఉన్న సహజ కణాలకు కొత్త శక్తినిస్తూ దెబ్బతిన్న కణాలకు మాత్రం మరమ్మతులు చేస్తుంది. కేవలం దెబ్బతిన్న కణాలు మాత్రమే కాదు ఆరోగ్యకరమైన కణాలలో కూడా రసాయన ఔషధాలు నూతనోత్తేజాన్ని నింపుతుంటాయి. ఆకలి మందగించిన క్యాన్సర్ బాధితుల్లో మొదట ఆకలి పుట్టేలా చేసి, సహజంగా ఉండే నీరసాన్ని కూడా తొలగించి బలాన్నిస్తుంటుంది. దీంతో పాటు శరీరంలో రోగనిరోధకశక్తి కూడా బలోపేతమవుతుంది కాబట్టి బాధితులు మొదట కోల్పోయిన శక్తిని తిరిగి సాధించి మరింత వేగంగా కోలుకునే అవకాశముంటుంది.
Also Read: క్యాన్సర్లలో సర్కోమాను రసాయన ఆయుర్వేదం తగ్గించగలదా?
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.