ఈ రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స వల్ల క్యాన్సర్ తిరిగి రాకుండా నయం చేయగలమా?

You are currently viewing ఈ రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స వల్ల క్యాన్సర్ తిరిగి రాకుండా నయం చేయగలమా?

రసాయన ఆయుర్వేదంలో అనేక మూలికల సమ్మిళితమైన లోహాలు, రసభస్మాలు, రస సింధూరాల వలన కలిగే ప్రధాన ప్రయోజనమే వ్యాధి పునరావృతం కాకుండా చేసి శరీరంలో దెబ్బతిన్న కణాలలో తేజస్సును నింపుతుంది. అత్యధిక క్యాన్సర్ పేషెంట్లు ఇతరత్రా ట్రీట్మెంట్లు వాడి చివర్లో ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆయుర్వేదం క్యాన్సర్ బాధితులకు కచ్చితంగా ఊరటనిస్తుందని తెలుసు కానీ ఎక్కడో అశ్రద్ధ ఆవహించడం వలన వెంటనే తగ్గిపోతుందన్న ఆశతో ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేసి ముందు ఇతర ట్రీట్మెంట్లకు ప్రాధాన్యతనిస్తుంటారు. చివరి దశలో ఉన్న క్యాన్సర్లకు కూడా రసాయన ఆయుర్వేదం చక్కటి ఉపశామనన్నిచ్చి ఒకసారి తగ్గినా తర్వాత కూడా ఒక కంట కనిపెడుతూ క్యాన్సర్ కణాలు మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తుంది.

సాధారణంగా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణమే శాశ్వత పరిష్కారం గురించి. ఆయుర్వేద వైద్యానికి ఉన్న విశ్వసనీయతే అది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఆయుర్వేదం చాలా ప్రత్యేక శైలిని అనుసరిస్తూ ఉంటుంది. అటువంటిది ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను లొంగదీయడానికి మరింత కఠినమైన కార్యాచరణను అనుసరిస్తుంది రసాయన ఆయుర్వేదం. వ్యాధి మూలాలను వెతికి మరీ వాటిని కట్టడి చేయడంలో రసాయన ఆయుర్వేదం అత్యంత సూక్ష్మస్థాయిలో పనిచేస్తుంది. శరీరంలో రుగ్మతలను పూర్తిగా తొలగించి అవి మళ్ళీ పునరావృతం కాని విధంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవయవం ఆరోగ్యకరంగా పనిచేస్తున్నంత కాలం రసాయన ఆయుర్వేదం అందించే ట్రీట్మెంట్ క్యాన్సర్ కణాలను ఒకసారి నాశనం చేసిన తర్వాత మళ్ళీ పుట్టకుండా కవచంలా కాపాడుతుంది.

Also Read: రసాయన ఆయుర్వేదంలో అరుదైన క్యాన్సర్లకు కూడా చికిత్స ఉందా?