క్యాన్సర్ నివారణలో మరియు చికిత్సలో ఉపయోగపడే 5 మూలికలు

You are currently viewing క్యాన్సర్ నివారణలో మరియు చికిత్సలో ఉపయోగపడే 5 మూలికలు

క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. దీన్ని మొదటి దశలో గుర్తించి చికిత్సను ప్రారంభించకపోతే, చికిత్సలో మెరుగైన ఫలితాన్ని పొందడం కష్టం. అల్లోపతిలో క్యాన్సర్ వ్యాధికి శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్ విధానాన్ని ఉపయోగించి చికిత్సను అందిస్తారు. ఈ చికిత్సా  విధానాల వల్ల దుష్ప్రభావాలు కూడా కలిగిస్తాయి. 

ఈ రోజుల్లో చాలామంది చికిత్స పరంగా ఆయుర్వేద మూలికలను సురక్షితమని భావిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ విషయంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రస్తుతం ప్రధానంగా కొన్ని కారణాల వల్ల ఆయుర్వేద చికిత్సను ఎంచుకుంటున్నారు. క్యాన్సర్ చికిత్స విధానంలో ఆయుర్వేదాన్ని ఎంచుకోడానికి గల కారణాలు:

  • దుష్ప్రభావాలు కలగకుండా వ్యాధిని మూలాల నుండి తొలగించడం. 
  • అలాగే చికిత్స సమయంలో ఎటువంటి బాధ లేదా నొప్పిని కలిగించకపోవడం. 
  • ముఖ్యంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం.

ఆయుర్వేద చికిత్స, క్యాన్సర్ తో బాధపడేవారి శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ మరియు టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది వివిధ అవయవాల పనితీరును బలపరుస్తుంది. మరియు పునరుద్ధరిస్తుంది. ఆయుర్వేద మందులు రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.

అంతేకాకుండా, ప్రాచీన భారతీయ ఆయుర్వేదంలో క్యాన్సర్ కణితి ఏ దశలో ఉందో మరియు దానిని ఏ విధంగా నయం చేయవచ్చో అనే అంశాలను గుర్తించడానికి కొన్నిఅధ్యయనాలు ఉన్నాయి. చికిత్సలో భాగంగా, ఆయుర్వేదం ఇతర ఔషధాలతో పాటుగా తెలిసిన కొన్ని మూలికలను ఉపయోగిస్తుంది. ఆయుర్వేద క్యాన్సర్ చికిత్సలో రసాయన చికిత్స ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఆయుర్వేదం క్యాన్సర్ కి చికిత్సను అందించే విధానం:

ఆయుర్వేద ఔషధం అనేది క్యాన్సర్‌కు ఒక ప్రత్యేకమైన చికిత్స, ఇది క్యాన్సర్ తో బాధపడే వారిపై ఎటువంటి చెడు ప్రభావాలు కలిగించకుండా  మంచి అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. చికిత్సలో భాగంగా క్యాన్సర్ తో బాధపడే వారికి మొదట, ఎలాంటి క్యాన్సర్ ఉంది, మరియు వారి శరీరానికి కావాల్సిన చికిత్సను గుర్తించడానికి పరీక్షలు చేస్తారు. ఆ తరువాత ఆ వ్యక్తి కోసం ప్రత్యేక ఔషధాన్ని తయారు చేస్తారు. తద్వారా క్యాన్సర్ తో బాధపడే వారికి కావాల్సిన ప్రత్యేకమైన ఆహారం మరియు వారి జీవితాన్ని మెరుగుపర్చడానికి సహాయపడే మూలికలను కూడా అందిస్తారు.

ప్రత్యేకమైన చికిత్సా విధానంతో, క్యాన్సర్ బాధితులు వారి శరీరంలోని విషపదార్థాలను మరియు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా ఆయుర్వేద చికిత్స నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ విధమైన చికిత్స మార్గం ద్వారా శరీరంలోని అనేక అవయవాల పనితీరును మెరుగుపరచవచ్చు మరియు పునరుద్ధరించవచ్చు. ఆయుర్వేద మందులు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి, చివరికి క్యాన్సర్ కణాలను చంపుతాయి. ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రం రోగి శరీరంలోని దోష్, ధాతు, మాల్, అప్‌ధాతు మరియు ఓజ్‌లలో సంభవించే మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే క్యాన్సర్ బాధితులు సమర్థవంతమైన చికిత్సను పొందవచ్చు. 

చికిత్స ప్రణాళికను రూపొందించడానికి, రోగి యొక్క రోగనిర్ధారణ, అలాగే క్యాన్సర్‌ యొక్క కారణం మరియు ఏ దోషం మరియు ధాతు దెబ్బతిన్నాయి అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగపడే ఆయుర్వేద మూలికలు:

అశ్వగంధ – యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు కలిగినది: 

ashwagandha root benefits

క్యాన్సర్ బాధితులు ఒత్తిడితో కూడిన జీవితాన్ని జీవిస్తుంటారు.  ఎందుకంటే వారి అనారోగ్యం దృష్ట్యా వారు ఎదుర్కునే సమస్యలు మరియు క్యాన్సర్ తిరిగి వస్తుందనే భావన వల్ల ఆందోళన చెందుతుంటారు. కొన్నిసార్లు ఒత్తిడికి కేవలం ఔషధానికి బధులుగా ఇతర చికిత్సలను ప్రయత్నించాలని అనిపిస్తుంటుంది. అలాంటి వారికి అశ్వగంధ మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అశ్వగంధ ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి  సహాయపడుతుందా అనే విషయాన్నితెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మనుషులు మరియు జంతువులపై పరీక్షలు చేసారు, కాకపోతే క్యాన్సర్‌ను నయం చేయగలదని లేదా నిరోధించగలదనే విషయం ఇంకా రుజువు చేయబడలేదు. ఒత్తిడి, ఆత్రుత, బలహీనత లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులను అశ్వగంధ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. ఇది అధికారికంగా ఆమోదించబడనప్పటికీ, సురక్షితమైనదని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఒకవేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, దీనిని వినియోగించేముందు వైద్యుడిని సంప్రదించాలి. అశ్వగంధను, మాత్రలు, క్యాండీలు లేదా జ్యూస్ వంటి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. నొప్పిని తగ్గించడానికి వీటిని మింగవచ్చు లేదా చర్మంపై రాసుకోవచ్చు. 

ఉసిరి:

green gooseberries wooden bowl

కొంతమంది శాస్త్రవేత్తలు ఉసిరిని తినడం వల్ల క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఎందుకంటే ఇది మన శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది మరియు వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాలేయం, మెదడు, రొమ్ము, పెద్దప్రేగు మరియు ఊపిరితిత్తుల వంటి ముఖ్యమైన అవయవాలకు ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. ఉసిరి మన శరీరం యొక్క ఎంజైమ్‌లు సరిగ్గా పని చేయడానికి కూడా సహాయపడుతుంది, ఉసిరి వంటి పండ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉసిరి మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించే చెడు కణాల ఆటంకానికి సహాయపడుతుంది. తద్వారా ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు. పెద్దప్రేగు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడంలో ఇవి సహాయపడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉసిరి జ్యూస్ మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు హాని కలిగించకుండా క్యాన్సర్ కణాలను చనిపోయేలా చేస్తుంది.

పసుపు: 

turmeric powder

భారతదేశంలో, పసుపు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. మరియు ఇది క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా క్యాన్సర్ చికిత్సకు కూడా ఉపయోగించబడుతుంది. ఇన్ఫ్లమేషన్ క్యాన్సర్ వంటి అనేక అనారోగ్యాలను కలిగిస్తుంది, కానీ పసుపు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. జంతువులపై మరియు ల్యాబ్‌లలో జరిపిన పరీక్షలలో పసుపు క్యాన్సర్ కణాలను వృద్ధిని నెమ్మది చేయగలదని మరియు వాటిని నాశనం చేయడంలో కూడా సహాయపడుతుందని తేలింది. 

గిలోయ్ లేదా గుడూచి:

గిలోయ్ అనేది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే ఒక మొక్క. గిలోయ్ అనే మొక్క క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే మన శరీరంలోని క్యాన్సర్ కణాలను చనిపోయేలా చేస్తుంది. మరియు కణితులను పెరగకుండా చేస్తుంది ముఖ్యంగా క్యాన్సర్ వ్యాప్తి చెందే అవకాశాలను తగ్గిస్తుంది. కాకపోతే వారు ఇప్పటికీ గిలోయ్ యొక్కను ఎంతకాలం ఉపయోగించాలనే విషయంపై మరింత పరిశోధన చేస్తున్నారు. ఆయుర్వేద క్యాన్సర్ చికిత్సలో, గిలోయ్ అనేది అశ్వగంధ, పసుపు మరియు గుగ్గులు వంటి ఇతర మొక్కలతో కలిపి తరచుగా ఉపయోగించే ఒక మొక్క. దీన్ని మాత్రలు, పొడి లేదా డికాషన్ వంటి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. కానీ ఆయుర్వేద చికిత్సలు శిక్షణ పొందిన వైద్యుడి సహాయంతో మాత్రమే ఉపయోగించగలరని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం మరియు ఇది క్యాన్సర్ చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదు. 

కల్మేఘ్ లేదా రాచ వేము: 

kalmegh

కల్మేఘ్ అనేది మన శరీరానికి నిజంగా మేలు చేసే ఒక ప్రత్యేక మొక్క. క్యాన్సర్ కణాలను నాశనం చేయడం ద్వారా క్యాన్సర్‌తో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది మరియు క్యాన్సర్‌కు కారకాల నుండి కాపాడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, మన శరీరం యొక్క సమతుల్యత దెబ్బతిని, విషపదార్థాలు శరీరంలో పేరుకుపోయినప్పుడు క్యాన్సర్ వస్తుంది. కానీ రాచ వేము తీసుకోవడం ద్వారా, వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. ఆయుర్వేద క్యాన్సర్ చికిత్సలో, కల్మేఘ్ అనేది వివిధ ప్రయోజనాల కోసం అశ్వగంధ, పసుపు మరియు గుగ్గులు వంటి ఇతర మొక్కలతో కలిపి తరచుగా ఉపయోగించే ఒక మొక్క. రాచ వేము మాత్రలు, పొడులు లేదా డికాషన్ వంటి రూపాల్లో వివిధ మార్గాల్లో ఉపయోగిస్తుంటారు. 

ఔషధగుణాలున్న మూలికలను మన జీవితంలో భాగం చేసుకుంటూ, దీర్ఘకాలీక వ్యాధులను నివవరించవచ్చు. ఇలాంటి మరింత విలువైన సమాచారం కొరకు.

Also read:  క్యాన్సర్ సంరక్షణలో ముందస్తు స్క్రీనింగ్ ఎంత వరకు సహాయకరంగా ఉంటుంది?