మానుష్య వైద్యం పేరిట మూలికలతో చేసే వైద్యం ఆయుర్వేదంలో బాగా ప్రాచుర్యం పొందింది. అందుకే ఆయుర్వేద వైద్యం అనగానే అందరికీ ఠక్కున మూలికల వైద్యమే గుర్తొస్తూ ఉంటుంది. కానీ క్యాన్సర్ వంటి జటిలమైన వ్యాధికి ట్రీట్మెంట్ మూలికలతో సాధ్యపడదని అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలోని అష్టాంగయోగాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది రసాయన ఆయుర్వేదం. దైవ వైద్యంగా పిలవబడే ఈ విశిష్ట వైద్యం ప్రత్యేకించి క్యాన్సర్ వంటి క్లిష్టమైన జబ్బులకు మహాద్భుతంగా పనిచేస్తుంది. అందుణా రసాయన ఆయుర్వేదం శరీరంలో ఇమ్యునిటీని ప్రత్యక్షంగా ప్రభావితం చేయగలదు. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్లో రసాయన ఆయుర్వేదం అత్యుత్తమమైనదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
క్యాన్సర్ వ్యాధికి చికిత్స అనేది పూర్తిగా ఆ వ్యాధి వ్యవహార తీరు పైనే ఆధారపడి ఉంటుంది. రసాయన ఆయుర్వేదం ముందుగా క్యాన్సర్ కణాల వ్యవహార శైలిని పూర్తిగా అధ్యయనం చేస్తుంది. మూడు విధాలుగా ట్రీట్మెంట్ అందించడం ద్వారా క్యాన్సర్లను ఇట్టే నాశనం చేయగలదు. ఔషధ రసాయన ఆయుర్వేదం, ఆహార రసాయన ఆయుర్వేదం, విహార రసాయన ఆయుర్వేదం. మొదటగా ఔషధాల ద్వారా అర్బుదరాశులను మట్టుబెట్టడం, ఆహారంతో జాగ్రత్త వహించడం, చివరిగా దైనందిన కార్యకలాపాలతో శరీరానికి నూతనోత్సహాన్నిస్తూ, మనసుకు మానసికోల్లాసాన్నిస్తూ విహార వ్యవహారాలతో కూడా క్యాన్సర్లను నయం చేయడం రసాయన ఆయుర్వేద వైద్యం విశిష్టత.
Also Read: క్యాన్సర్ పేషెంట్ ఇమ్మ్యునిటీ విషయంలో రసాయన ఆయుర్వేదం పనిచేస్తుందా?
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.